30-05-2025 07:11:31 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 56వ జన్మదినాని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు.
ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు(Mahadevpur Block Congress President Kota Rajababu) మాట్లాడుతూ... జనహృదయనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం మంథిని నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడే వ్యక్తి శాంత స్వభావులు దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.
ఇంకా రాష్ట్ర అభివృద్ధికి, మంథిని నియోజక అభివృద్ధికి పాటు పడుతూ రాష్ట్రంలోనే మంథిని నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10 కిలోల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.