14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

19-01-2026 12:00 AM

డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ 

మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్యం, రోడ్లు, తాగునీటి వసతి మెరుగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రోడ్డు సౌకర్యం మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని పేర్కొన్నారు. బలపాల గ్రామ ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్నారు. ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.