ఇంధనం పొదుపు దిశగా సర్కార్
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తగ్గింపు
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంధనం కొరత నేపథ్యంలో వాడకం తగ్గించాలని ఇటీవల ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం వో సైతం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దూర ప్రాంతాలకు మినహా సిటీలో రెండు, మూడు వాహనాలతోనే సీఎం కాన్వాయ్ వెళుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు మరోసారి సీఎం కాన్వాయ్ తగ్గింపు అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. దీంతో సిటీ బయటకు వెళ్లినా కాన్వాయ్ తగ్గిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కాన్వా య్ మాత్రమే కాకుండా మంత్రుల కాన్వా య్ కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
కేవలం తెలంగాణ ప్రభుత్వమే కా కుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఢిల్లీలో సీఎం కాన్వాయ్ నుంచి 60 శాతం వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో వారం రోజుల పాటు ఉద్యో గులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైతం నిర్ణయించారు.






