27-05-2025 12:00:00 AM
కంది ఐఐటీ కల్చర్ ఫెస్ట్లో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
సంగారెడ్డి, మే 26 (విజయక్రాంతి): మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ కల్చరల్ ఫెస్ట్కు సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ సంస్కృతి, సాం ప్రదాయానికి సమాఖ్య విధానం, ధర్మం ఉం దన్నారు. గురువు దీపంలాంటి వారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గురు శిష్య బంధం ఉందని తెలిపారు.
భారతదేశం 5000 సంవత్సరాల చరిత్ర కల్గి ఉన్నదన్నా రు. కల్చర్ ఫెస్ట్ అనేది ఒక ఉద్యమంగా కొనసాగుతుందన్నారు. భారతదేశ సాంప్రదా యాల్లో కుటుంబ పెద్దలకు, గురువును గౌరవించే పద్దతి ఉందన్నారు. ఈ ఫెస్ట్లో 240 మంది కళాకారులు పాల్గొంటున్నారని, దేశ వ్యాప్తంగా వివిధ కళలో ప్రముఖులు పా ల్గొంటున్నారని తెలిపారు.
కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, వైవిధ్యభరిత మైన సంస్కృతుల కలయికగా నిలి చిందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి, పద్మవిభూ షణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పద్మభూషణ్ డాక్టర్ రాజ్యంలతో పాటు 200 మంది సంగీత ప్రముఖులు పాల్గొన్నారు.