12-06-2025 12:11:52 AM
కరీంనగర్, జూన్ 11 (విజయ క్రాంతి): స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుండి వస్తున్న వివిధ రకాల పథకాలు ప్రతి మహిళకూ చేరేలా గ్రామ సంఘం పదాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామైక్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులకు తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో నిర్ణీత సభ్యుల కంటే తక్కువ సంఖ్య లేకుండా చూడాలని సూచించారు. దివ్యాంగులకు 60 నుండి 65 సంవత్సరాల లోపు వృద్ధ మహిళలకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులను, దివ్యాంగులను కూడా సభ్యులుగా చేర్చుకునే బాధ్యత వి.ఓ లపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, ఏపీఎం రామ్మోహన్పాల్గొన్నారు.