12-06-2025 12:12:11 AM
- కన్జర్వేషన్ రిజర్వ్తో ఎవరికీ నష్టం కలుగదు
- గ్రామాలను ఖాళీ చేయించం.. భూములు తీసుకోం..
- డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ వెల్లడి
ఆసిఫాబాద్, జూన్ 11(విజయ క్రాంతి) :జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుతో ఎవరి హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్ అన్నారు. బుధవారం జిల్లా అటవిశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుపై ప్రజలకు ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉన్నాయన్నారు.
టైగర్ జోన్ వేరని, టైగర్ కన్జర్వేషన్ వేరని స్పష్టం చేశారు. టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు ద్వారా భూములు, గ్రామాలు, రోడ్డకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. జిల్లా 2014 నుంచి టైగర్ కారిడార్లోనే కొనసాగుతుందని జిల్లాలోని గిన్నెదరి, జోడేఘాట్ 2012 నుంచి టైగర్ జోన్లో ఉన్నాయని ఆయా రేంజ్ పరిధిలో ఎలాంటి పరిమితులు విధించలేదని గుర్తు చేశారు.
జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటుతో ఏకో టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటుతో గ్రామాలను ఖాళీ చేయంచడం కానీ, భూములు తీసుకోవడం కాని ఎటి పరిస్థితుల్లో జరుగదన్నారు. ఎవరి హక్కులకు భంగం కలగదని ఎలాంటి పరిమితులు పంతులు ఉండవని ప్రజలు అపోహలను నమ్మవద్దని డీఎఫ్ఓ పేర్కొన్నారు..