11-11-2025 04:59:45 PM
ముత్తారం (విజయక్రాంతి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్విమ్మింగ్ లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 17 విభాగంలో ఫ్రీ స్టైల్ లో టీ.మోక్షిత్ బ్యాక్ స్ట్రోక్ లో శశికుమార్ ఎంపికయ్యారు. వీరు ఇరువురు ఈనెల 13 నుండి 15 వరకు వికారాబాద్ స్విమ్మింగ్ అకాడమీలో జరగబోయే రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు పాల్గొననున్నారు. వీరిని హెడ్ మాస్టర్ పద్మ దేవీరెడ్డి, పిడి వెంకటేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సూర్య ప్రకాష్, తిరుపతి అభినందించారు.