21-06-2025 12:24:05 AM
జేబులు నింపుకుంటున్న బియ్యం మాఫియా
యథేచ్ఛగా ఖమ్మం జిల్లా నుంచి తరలింపు
చోద్యం చూస్తున్న యంత్రాంగం
ఖమ్మం, జూన్ 20 (విజయక్రాంతి): కొందరు ప్రజల అవగాహనా రహిత్యాన్ని ఆ సరాగా చేసుకొని బియ్యం మాఫియా వారి జేబులు నింపుకొంటున్నారు..... గతంలో అంటే లావు బియ్యం... తినలేక అమ్మేవా రు... కానీ నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తుం ది...అంతే కాకుండా ఈ బియ్యంలో కొన్ని పోషకాలు కూడా కలుపుతారు.
అధికారులు సరైన అవగాహన కల్పించక పోవటముతో, ఇతరత్ర కారణాలతో లబ్దిదారులు ఈ సన్న బియ్యం విక్రహిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి లారీల్లో ఆంధ్రకు, హైదరాబాద్, ఇతరత్రా ప్రాంతాలకు ఈ బియ్యన్ని లారీల్లో తరలిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప మాఫియా కి అడ్డు కట్ట వేసే ఏర్పాట్లు చేయటము లేరని ప్రజలు అంటున్నారు
రెగ్యులర్గా జరిగే వాహనాల తనిఖీల్లో పోలీస్ వారికి ఈ వాహనాలు పట్టుబడుతున్నాయి తప్ప వీటికోసం దాడులు చేసి పట్టుకొన్న సందర్భాలు తక్కువ. గురువారం 145 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారిని వైరా ఎస్ ఐ రామారావు ఆధ్వర్యం లో వైరా లో పట్టుకొన్నారు. ఈ లారీ కల్లూ రు మండలం నుండి గాజ్వెల్ కి రేషన్ బి య్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొన్నారు.
లారీ డ్రైవర్ తనను తమ ఓనర్ కల్లూరు వెళ్ళి లోడ్ తావలసిందిగా చెప్పి పంపారాని, కల్లూరు వెళ్లగా ఇద్దరు వచ్చి కల్లూరు కు 10 కిలోమీటర్ ల దూరంలో వున్న మామిడి తోటలో కి లారీ తీసుకెళ్లి లోడ్ చేసారని డ్రైవర్ పోలీస్ లకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ నెల 12న పెనుబల్లి మండలం లంకసాగర్ లో 100 క్వింటల రేషన్ బియ్యాన్ని లారిలో అక్రమంగా తరలిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు కల్లూ రు మండలం కప్పల బంధం రోడ్ లో పోలీ స్ లు 4 క్వింటా ల రేషన్ బియ్యం పట్టుకొన్నారు.
ఈ నెల 10 న ఖమ్మం మూడవ పట్టణంలో 45 క్వింటల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకొన్నారు. ఇటీవల సివిల్ సప్లై అధికారుల ఆధ్వర్యంలో తల్లాడ మం డలం కుర్ణవల్లి గ్రామంలో 15 క్వింటా ల రేషన్ బియ్యం పట్టుకొన్నారు.
తనిఖీలు చేయాలి
అధికారులు ఈ విషయాలపై లోతు గా దర్యాప్తు చేసి ఈ మాఫియాను కట్టడి చేయాలనీ, ముమ్మరంగా తనిఖీలు చేయాలనీ, ప్ర తీ ఏరియా లో ఈ మాఫీయా కు సహకరిస్తున్న వారు వున్నారని... గ్రామాల్లో చిన్న పిల్లవాడికి కూడా వాళ్ళ పేర్లు తెలుసని ప్రజలు అనుకొంటున్నారు. అధికారులు తలుసుకొంటే వారిని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు.
అవగాహనా సదస్సులు నిర్వహించాలి
రేషన్ ద్వారా ఇచ్చే ఈ సన్న బియ్యంలో పోషకాలు కలిపే విషయం చానా మందికి తెలవదు, కావునా అవగాహన సదస్సులు నుర్వహించి లబ్దిదార్లు ఈ బియ్యం అమ్మ కుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి.