calender_icon.png 17 November, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీ రోడ్డు ప్రమాదం.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది

17-11-2025 07:23:32 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం అన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మదీనా హైవేపై జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదం అని అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ సందర్భంగా నాంపల్లిలోని హజ్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీల సంక్షేమ మంత్రి మొహమ్మద్ అజార్ ఉద్దీన్, TMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషితో కలిసి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత  క్లిష్ట సమయంలో మరణించిన వారి ఆత్మలకు మా హృదయపూర్వక ప్రార్థనలు వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రత్యేక హెల్ప్ లైన్  ఏర్పాటు చేసింది.సహాయం కోసం, కుటుంబాలు GAD NRI హెల్ప్‌లైన్: 7997959754 ను సంప్రదించవచ్చు అన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.