నేటి బాలలే రేపటి పౌరులు
ఆ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది
ఐతరాజ్ పల్లి సర్పంచ్ దీకొండ భూమేష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి, వార్షిక పరీక్షలు పూర్తి చేసుకొని పై తరగతులకు వెళుతున్న విద్యార్థులకుఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ దీకొండ భూమేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని ఆ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిది అని ఇది కేవలం ఉపాధ్యాయుల బాధ్యతే అనుకుంటే పొరపాటు అని, అందుకు సమాజం సహకరించినప్పుడే మంచి పౌరులను ఉపాధ్యాయులు తయారు చేయగలరు అని
గ్రాడ్యుయేషన్ డే అంటే ఏదో యూనివర్సిటీల్లో విద్యను పూర్తి చేసుకున్న వాళ్లకు , అమెరికా తదితర విదేశాల్లో విద్యను పూర్తి చేసుకున్న పిల్లలకు తల్లిదండ్రులు జరిపే కార్యక్రమంగా మనం ఇంతకాలం చూశామని, ఆ పిల్లలకు ఇచ్చే స్ఫూర్తే మన పాఠశాల ఉపాధ్యాయులు మన చిన్నారులకు వైబవోపేతంగా నిర్వహించడం గొప్ప విషయం అని , సెంటర్ ఫర్ స్క్వేర్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఇటీవలే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఒక సర్వే నిర్వహించింది అని అందులో పెద్దపల్లి జిల్లా ముందజలో ఉందన్నారు , అందులో మన పాఠశాల జిల్లాలో టాప్ 5 లోపు ఉండడం మనకు గర్వకారణం అని, అందుకు ఉపాధ్యాయులను మనస్పూర్తిగా అభినందిస్తున్న అని, ఇదే స్ఫూర్తి రాబోవు విద్యా సంవత్సరం లో కొనసాగించాలని కోరారు.






