21 April, 2026 | 4:44 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి

25-04-2025 01:26 AM

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బృందం

ఖమ్మం, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ):-కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోనీ తన ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర బృందంతో, ఐ.కె.పి., ప్యాక్స్, డి.సి.ఎం.ఎస్., మెప్మా, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

అంతకుముందు పౌరసరఫరాల కమీషనర్ కార్యాలయం నుంచి డిప్యూటీ కమీషనర్, జనరల్ మేనేజర్ ప్రొక్యూర్ మెంట్, ఎస్.డబ్ల్యూ.సి జనరల్ మేనేజర్  కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నేలకొండపల్లి మండలంలోని అరుణాచల రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల డిప్యూటీ కమీషనర్ కొండలు రావు,  జనరల్ మేనేజర్ నాగేశ్వర్ రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ తహసిల్దార్ (సిఎస్.), ఖమ్మం రూరల్, నేలకొండపల్లి సి.ఎస్. ఆర్.ఐ, తదితరులు పాల్గొన్నారు.