ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల(Telangana State Formation Celebrations) నిర్వహణకు మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు. కార్యాలయాన్ని త్రివర్ణ శోభిత విద్యుత్ దీపాలతో అలంకరించడంతో కొత్త శోభను సంతరించుకుంది. సోమవారం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Government Whip Dr. Jatoth Ramachandru Naik) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ విప్ చేతుల మీదుగా జాతీయ ప్రతాకావిష్కరణతో పాటు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పంపిణీ నిర్వహించనున్నారు.






