01-06-2025 08:21:34 PM
మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్..
మంథని (విజయక్రాంతి): రేపటి నుండి మంథని నుండి జమ్మికుంట బస్సు సర్వీసు పునః ప్రారంభించబడుతుందని మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్(RTC Depot Manager Shravan Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క సర్వీస్ ప్రతిరోజు మంథని నుండి బయలుదేరి వయా ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట మీదుగా హుజురాబాద్ వరకు రెండు ట్రిప్పులు కొడుతుందని, మొదటి ట్రిప్పు ఉదయం 6. 15 ని.లకు బయలుదేరి ఓడేడులో 7 గంటలకు ఉంటుందని, అలాగే రెండో ట్రిప్పు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరీ ఓడేడు లో 2.40 ని. లకు ఉంటుందని, అలాగే హుజురాబాద్ నుండి మొదటి ట్రిప్పు ఉదయం 10 గంటలకు, రెండవ ట్రిప్పు 5. 40 నిమిషాలకు ఉండునని, కావున ఈ అవకాశాన్ని మంథని, హుజరాబాద్ ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకుని ఈ యొక్క సర్వీస్ ను విజయవంతం చేయగలరని మేనేజర్ కోరారు. మంథని నుంచి హుజురాబాద్ కు బస్సు పునరుద్ధరణ పై ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.