06-06-2025 12:46:51 AM
- ప్రజా సేవలో ఏడాది పూర్తి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహణ
- అన్నదాన కార్యక్రమం, ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల పంపిణీ
- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
- హాజరైన డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల, మేయర్, కాంగ్రెస్ నేతలు రాయల, మద్దినేని స్వర్ణకుమారి, దయాకర్ రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్
ఖమ్మం, జూన్ 5(విజయ క్రాంతి):పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి విజయం సాధించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా తొలుత భారీ కేకును కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కట్ చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణ కుమారి, మేయర్ పునుకొల్లు నీరజ, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్యతో కలిసి ప్రసంగించారు.
ప్రజా సేవలో ఎంపీ గారి శైలి ఎంతో ప్రత్యేకమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాయల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుం బూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా చరిత్రలో ఎవరికీ దక్కనంత అఖండ మెజారిటీతో గెలుపొంది.. ప్రణాళికా ప్రకారం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని వివరించారు. ఆ తర్వాత 500 మందికి అన్నదానం చేశారు.
50 మందికి పైగా రక్తదానం..
తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తొలుత కాంగ్రెస్ జిల్లా నాయకులు కొ ప్పుల చంద్రశేఖర్ రక్తదానం చేయడంతో శిబిరం ప్రారంభమైంది. మొత్తం 50 మందికి పైగా రక్తదానం చేశారు. డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, సిబ్బంది సేకరించి ధన్యవాదాలు తెలిపారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..
యువజన కాంగ్రెస్ బాధ్యులు కే.క్రాంతి, బానోత్ కిరణ్ ఆధ్వర్యంలో నగరంలోని కాలువొడ్డు నుంచి.. గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు..
ఎంపీ రఘురాం రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు.. మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో..: కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, లింగాల రవికుమార్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, టీఏసీ సభ్యు లు, యువజన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.