04-08-2025 12:21:02 AM
మేడిపల్లి జూలై 3: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటరమణ హిల్స్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు దాతల సహకారంతో అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించి. మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను నిర్వహించి సామూహిక అర్చనలు, అభిషేకాలు, హోమాలు, నిర్వహించారు.
ఆదివారం వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పిర్జాది గూడ మాజీ మేయర్ అమర్ సింగ్ పలువురు మాజీ కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ , ఇతర ప్రతినిధులు రంజిత్ గౌడ్, శ్రీధర్ గౌడ్ ప్రభాకర్,రామారావు, బాలస్వామి, శంకర్రావు, ప్రతాపరెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.