ఘనంగా రథోత్సవం
06-02-2025 12:11 AM
కడ్తాల్, ఫిబ్రవరి 5 ( విజయ క్రాంతి) : మండలంలోని మక్తమాధారం శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి భక్తులు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వింజమూరి రామానుజాచార్యులు, మార్కెట్ చైర్మన్ గీత నర్సింహా, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.






