12 June, 2026 | 12:08 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ఘనంగా ఈస్టర్ వేడుకలు

06-04-2026 01:47 AM

గరిడేపల్లి, ఏప్రిల్ 5 : మండలంలోని కీతవారి గూడెం, వెలిదండ పలు గ్రామాలలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీతవారిగూడెం గ్రామంలో కలవరి దార ప్రార్థన మందిరంలో ఏసుక్రీస్తు పునర్దానం ఈస్టర్ వేడుకలను సంఘం సభ్యులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఆదివారం ఈస్టర్ సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు.

మానవాళి చేసిన పాపములు కొరకు ఏసుక్రీస్తు సిలువ మరణం ఫలితంగా పాపాలు క్షమించబడ్డాయనీ తెలిపారు. ఏసుక్రీస్తు తిరిగి మూడో రోజు లేచిన దినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారన్నారు. కార్యక్రమంలో పాస్టర్ మోజెస్ పాల్, పెద్దకొండ మంగమ్మ, కీత పాపమ్మ, బోయిళ్ళ తిమోతి, అనంతు మంగమ్మ,  విజయలక్ష్మి, సుజాత, చింతమల్ల అశోక్, నాగమణి పలువురు పాల్గొన్నారు.