ఘనంగా ఈస్టర్ వేడుకలు
06-04-2026 01:47 AM
గరిడేపల్లి, ఏప్రిల్ 5 : మండలంలోని కీతవారి గూడెం, వెలిదండ పలు గ్రామాలలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీతవారిగూడెం గ్రామంలో కలవరి దార ప్రార్థన మందిరంలో ఏసుక్రీస్తు పునర్దానం ఈస్టర్ వేడుకలను సంఘం సభ్యులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఆదివారం ఈస్టర్ సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు.
మానవాళి చేసిన పాపములు కొరకు ఏసుక్రీస్తు సిలువ మరణం ఫలితంగా పాపాలు క్షమించబడ్డాయనీ తెలిపారు. ఏసుక్రీస్తు తిరిగి మూడో రోజు లేచిన దినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారన్నారు. కార్యక్రమంలో పాస్టర్ మోజెస్ పాల్, పెద్దకొండ మంగమ్మ, కీత పాపమ్మ, బోయిళ్ళ తిమోతి, అనంతు మంగమ్మ, విజయలక్ష్మి, సుజాత, చింతమల్ల అశోక్, నాగమణి పలువురు పాల్గొన్నారు.




