17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గ్రీవెన్స్ తక్షణ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

18-11-2025 12:26 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫి ర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించా రు.

ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ 97 దరఖా స్తులను అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖలకు పరి ష్కారం కోసం కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మధుసూదన రాజు, మరియన్న, విజయనిర్మల, రాజయ్య, నరసింహమూర్తి, దేశి రా మ్, విజయ, యాదగిరి, శ్రీమన్నారాయణ రెడ్డి, వినోద్ సురేష్ పాల్గొన్నారు.