30-05-2025 02:45:49 AM
నైరోబి, మే 29: ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, ఆరు దశాబ్దాల పా టు అలుపెరగని సాహితీ ప్రస్థానంతో కెన్యాను బ్రిటీష్ వలస పాలన నుంచి స్వతంత్ర దేశంగా మార్చిన గుగీ వా థియాంగో (87) కన్నుమూశారు. గుగీ వా వీప్ నాట్, చైల్డ్ అండ్ పెటల్స్ ఆఫ్ బ్లడ్ వంటి ప్రఖ్యాత నవవలతో ప్ర సిద్ధి చెందారు. ఆయన స్థానిక ఆఫ్రికన్ భాషలలో సాహిత్య రచనలను ప్రో త్స హించారు. నోబెల్ బహుమతికి గుగీ వా థియాంగో పలుమార్లు నామినేటళ్ అయినప్పటికీ పురస్కారం వరించకపోవడం దురదృష్టకరం.
1 938లో కెన్యాలోని లిమురులో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో గుగీ వా థియాంగో జన్మించా రు.1977 గుగీ వా థియాంగో జీవితంలో కీలక సంవత్సరం. ఆంగ్ల భాషను వదిలి తన మాతృభాష కికుయులో నవలలు రాయడం ప్రారంభించారు. న్గాహికాందీంద (ఐ విల్ మ్యారీ వెన్ ఐ వాంట్) నాటకాన్ని అప్పటి జోమో కెన్యాట్టా ప్రభుత్వం నిషేధించి గుగీ వాను జై లుకు పంపించింది.
అక్కడ టాయిలెట్ పేపర్పై ఆయన రాసిన తొలి కి కుయు నవల ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ రాశారు. ఇక 1996లో గుగీ వా థి యాంగో భారతదేశానికి విచ్చేశారు. ఆ పర్యటనలో ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించడం విశేషం. గుగీ వా థియాంగో రచనలైన ‘డెవిల్ ఆన్ ది క్రాస్’, డిటెయిన్డ్ రైటర్స్ ప్రిజన్ డైరీ తెలుగులోకి అనువాదాలవ్వడం విశేషం.