30-05-2025 02:48:21 AM
ఇస్లామాబాద్, మే 29: పాకిస్థాన్ సైన్యం మేల్కొనేలోపే కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులు చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్, పీవోకేలో దా డుల చేసిన భారత సైన్యం అనేక ఉగ్ర, సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజర్బైజాన్ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో ఆయన దాడు లు జరిగిన విషయాన్ని అంగీకరించారు. భారత్ దాడులను ధీటుగా తిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి నిర్ణయించుకున్నామని తెలిపారు.
అయితే 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగిసిన వెంటనే దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధమైందన్నారు. కానీ తమ ప్రణాళిక అమలుకు కొన్ని గం టల ముందే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని తెలిపారు. రావల్పిండి ఎయిర్పోర్టు సహా అనేక కీలకప్రాం తాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు. అయితే దాడుల ప్రణాళిక గురించి ఆర్మీ చీఫ్ మునీర్ ముందుస్తుగా చెప్పినప్పటికీ తాము అలెర్ట్ అవ్వలేకపోయామన్నారు.