23 August, 2026 | 6:57 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు పెట్టాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ

02-08-2024 12:39 AM

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, వారి సంక్షేమ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎమ్మెల్సీలు ఎల్ రమణ, గోరటి వెంకన్న సూచించారు. విదేశీ ద్రవ్యంతో దేశానికి, రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందుతున్నారని, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని పేర్కొన్నారు. విదేశాల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నవారి మృతదేహాలు కూడా సకాలంలో స్వస్థలాలకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న మాట్లాడుతూ.. నిత్యవసర సరుకుల కల్తీ అవుతున్నాయని, వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని సూచించారు. నూనెలు, పసుపు, కారం వంటి అనేక వస్తువులు పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి వస్తున్నాయని, వాటిపై అధికారులు నిఘా పెట్టాలని పేర్కొన్నారు.