27-05-2025 07:39:17 PM
నాగారం: సూర్యాపేట జిల్లా(Suryapet District) నాగారం మండలం తన స్వగ్రామ నాగారంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట తాజా శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సునీత తన తండ్రి రామచంద్రారెడ్డి నాగారం మండల మాజీ వైస్ ఎంపీపీ గుంతకండ్ల మణిమాల రమేష్ రెడ్డి సురేష్ రెడ్డి సునీత మహేష్ రెడ్డిఅరుణ కుటుంబ సభ్యులతో కలిసి సావిత్రమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
సావిత్రమ్మ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కలేట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు కలేట్ల పెళ్లిశోభన్ బాబు తిరుమలగిరి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య గౌడ్ మాజీ ఎంపీపీ కూరమణి వెంకన్న చిప్పలపల్లి సోమయ్య చిరంజీవి కన్నెబోయిన బద్రి మల్లేష్ కన్నేబోయినబాలమ్మ సైదులు యాదగిరి ఎల్లయ్య బాలు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.