16 April, 2026 | 9:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

‘ఓటుకు నోటు’పై నాంపల్లి కోర్టులో విచారణ

14-06-2025 01:02 AM
  1. తదుపరి విచారణ జూలై 25కు వాయిదా 

వ్యక్తిగత హాజరు నుంచి సీఎం రేవంత్‌కు మినహాయింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): తెలుగు రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై శుక్రవా రం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వ్యక్తిగత హాజ రు నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి న్యా యస్థానం మినహాయింపునిచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఈ కేసు లో నిందితులుగా ఉన్న సెబాస్టియ న్, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్‌లకు కూడా కోర్టు విచారణకు హాజ రు కాకుండా మినహాయింపునిచ్చింది.

మరోవైపు విచారణకు నిందితులుగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్య హాజరయ్యారు. కేసు విచారణను వేగవంతం చేసి త్వరగా తే ల్చాలని వారు ఈ సందర్భంగా కో ర్టును కోరారు.

ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా విచారణను వాయిదా వే యాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పైకోర్టులో స్టే పొందాలని లేదా ఇక్క డి విచారణను కొనసాగించాలని స్ప ష్టం చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.