21-06-2024 12:00:00 AM
పశ్చిమ బెంగాల్లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతోపలువురు మరణించారు. భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద,్ధ చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గూడ్స్ రైలును నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు.అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు? ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్ రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కానీ మానవ తప్పిదం లేకుండా ప్రమాదాలు జరగవు. రైల్వేలో దాదాపు 20వేల లోకో పైలట్లు , అసిస్టెంట్ లోకో పైలట్ల్ల పోస్టులు సంవత్సరాలుగా ఖాళీలుగా ఉన్నట్టు తెలుస్తోంది.
2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్లలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోం ది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70,000 కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. నాణ్యతతో కూడిన రక్షణ భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మున్ముం దు జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కూడిన ఒక విస్తృత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
భద్రతా చర్యల కోసం కఠినమైన నియమ నిబంధనలు రూపొందించి వాటిని ఎట్టి పరిస్థితిలోను కూడా విస్మరించకుండా అమ లు పరిచినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. వీటిని కఠినంగా అమలుపరచడా నికి అవసరమైతే పార్లమెంటులో ఒక చట్టం చేయాలి. ప్రమాదాలు నివారించడానికి సూచనలు, సలహాలు ప్రజల వద్ద నుండి కూడా విస్తృతస్థాయిలో స్వీకరించాలి. బుల్లెట్ రైళ్లు, వందే భారత్ రైళ్లతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణం కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ఒక భరోసా కలుగుతుంది.
దండంరాజు రాంచందర్ రావు