22-09-2025 12:00:00 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
చిట్యాల/మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
ఆదివారం మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు రూ.16,50,000 సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీడీవో సురేందర్, టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్, ఏఏంసి వైస్ చైర్మన్ రఫీ, సోసైటి చైర్మెన్ సంపెల్లి నరసింగరావు,జిల్లా నాయకుడు పోలినేని లింగరావు, తక్కల పల్లి రాజు, టౌన్ అధ్యక్షుడు క్యతరాజు రమేష్, నడిగోటి రాము పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
చిట్యాల మండలంలో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు.కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కొమురయ్య, చిట్యాల మండల కేంద్రానికి చెందిన పెరుమాండ్ల కృష్ణ, అందుకు తండా గ్రామానికి చెందిన దాసారపు రాజయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన వావిళ్ళ రాములు, మండ రాజక్క, భిక్కనూరి లచ్చక్క వివిధ కారణాలతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, చిట్యాల టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ దబ్బేట అనిల్, చిలుకల రాయకొమురు,గంగాధరి రవీందర్, నక్క భాస్కర్ ఉన్నారు.