11 April, 2026 | 2:08 AM

యోగాతో ఆరోగ్యం

11-04-2026 12:00 AM

కలెక్టర్ కే హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో యోగ ఫర్ వన్ ఎర్త్  వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రతిరోజూ యోగా ఆచరించడం వల్ల శరీరానికి దృఢ త్వం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలోఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో రహదారి ప్రమా దాలు నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఆర్డీఓ దత్తారావు పాల్గొన్నారు.