01-09-2024 12:00:00 AM
‘సీపీఎస్’ అని క్లుప్తంగా పిలుకుచుకు న్నా.. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ అని అర్థమయ్యేలా చెప్పినా భాగస్వామ్య పింఛ ను పథకాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది మాత్రం 2004 సెప్టెంబ ర్ 1 నుంచి. పంద్రాగస్టు, అక్టోబరు 2 వంటి తేదీలను అందరూ గుర్తు పెట్టుకుంటారు. కారణం, ఆయా రోజుల విశిష్టత అది. అలా గే, సెప్టెంబర్ 1 కూడా ఉద్యోగులను మరవనివ్వకుండా చేసింది. తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం పోయిందన్న వ్యధను మిగిల్చింది. ఉద్యోగం ఒక యోగం, ప్రజా సేవ అవకాశం మహద్భాగ్యం అని భావించడం పరిపాటి. నౌకరీ ఉన్నదన్న ధీమాతోపాటు సైడ్ ఎఫెక్ట్ లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిణమించింది.
తమకు పింఛను రాదని మానసికంగా ఉద్యోగులు దాదాపు సిద్ధమయ్యారు. ప్రభు త్వ ఉద్యోగి అంటే సర్వీసులో ఉన్నన్నాళ్లూ జీతం, ఆ తర్వాత పెన్షన్.. ఇక టెన్షన్ లేని జీవనం అన్నది సామాన్య జనాభిప్రాయం. పాలకులు, ప్రభుత్వాలు, ఎలా ఆలోచించా రో ఏమో కాని, ప్రశాంతంగా ఉన్న ఉద్యోగంలో పెన్షన్ రాదన్న టెన్షన్కు తెర తీసింది 2004 సెప్టెంబర్ 1. ఆనాటి నుంచి గవర్నమెంటు ఉద్యోగంలో చేరిన వారికి పింఛను భరోసాకు భంగం, అసంతృప్తిని కల్గించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడే ఈ సీపీఎస్కు పాలకులు ఎస్ అన్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడెపుడు నో అంటారా? అని సర్కారు వేతనజీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘సీపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు’ అని నినదిస్తున్నారు. కాం ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆయా రాజకీయ పక్షాలుకూడా ఉద్యోగవర్గాల పక్షాన ఉన్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొని, ఉద్యమ రూపం దాల్చింది. దాముక కమలాకర్ నేతృత్వంలో 2016 లో సీపీఎస్ రద్దుకోసం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఏకమయ్యేలా కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోియేషన్ (సీపీఎస్టీఈఏటీఎస్) ఏర్పాటైంది.
అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సీపీఎస్ రద్దుకోసం ఆలోచించే వాతావరణం నెలకొంది. సీపీఎస్ను ఎలాగైనా రద్దు చేస్తారే మో అన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికలకు ముం దు రాజకీయ పార్టీల ఎజెండాలో సీపీఎస్ రద్దును ఓ ప్రధాన అంశంగా చేర్చేలా ఆయా పార్టీలకు విజ్ఞాపనలు చెయ్యడమూ జరిగింది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఎన్ని ఉన్నా, సీపీఎస్ రద్దు ఏకైక ఎజెండాగా పోరాడేలా అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి గల్లీ నుంచి ఢిల్లీదాకా పాలకులు పునరాలోచించ వలసిన పరిస్థితి వచ్చేలా చేసింది.
సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే అతని ప్రాన్ ఖాతాలో జమై ఉన్న నామ మాత్రపు మొత్త మే కుటుంబానికి అందుతుంది. దీనిని అర్థం చేయించడానికి హైదరాబాద్ వేదికగా ఎన్నో సమావేశాలు, సభలు, వర్క్ షాపులు జరిగా యి. ‘అయ్యా.. మా మొరను దయచేసి ఆలకించండి. మేము ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నమో సోదాహరణంగా చెప్తాం, వినండి’ అని ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్లో ఓ మేధో మథనం వంటి సమావేశమూ జరిగింది. ‘మా జీవితాల్లో ఆనందం నింపండి ప్రభో..’ అంటూ అంద రూ వేడుకున్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ‘నో ఎన్పీఎస్, నో యూపీఎస్, ఓన్లీ ఓపీఎస్’ అంటూ సాధ్యమైనన్ని ట్వీట్లు, బుధ, గురు, శుక్ర వారాల్లో ఉద్యమ స్పూర్తి తో పెట్టడం ద్వారా మరోమారు పాలకులకు ‘సీపీఎస్ రద్ కరో’ అని నినాదం చేరేలా ప్రయత్నం జోరుగా సాగుతున్నది.
మాచన రఘునందన్
రాష్ట్ర ప్రచార కార్యదర్శి,
సీపీఎస్టీఈఏటీఎస్