01-09-2024 12:00:00 AM
అసెంబ్లీ, లోకసభ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు గెలిచిన తర్వాత తాము ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయడంలో విఫలమైనా, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినా నియోజకవర్గ ఓటర్లు కౌన్సిల్గా ఏర్పడి ప్రజాభిప్రాయం ద్వారా పదవీచ్యుతుణ్ణి (రీకాల్ ) చేసే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయా లి. అభివృద్ధి చెందిన దేశాలలో రీకాల్ విధానం అమలులో ఉంది. ఆ దేశాలలో చట్టసభ సభ్యుల్లో, పారదర్శకత, జవాబుదారీతనం ఉండడం వల్ల సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి సంక్షేమం, ప్రగతి పరుగులు పెడుతున్నాయి.
ప్రజా ప్రతినిధుల నేరచరిత్రను ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చి చట్ట ప్రకారం నేర చరితుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే సమగ్రమైన ఎన్నికల సంస్కరణను చేపట్టే అధికారం సీఈసీకి దఖలు పరచాలి. చట్టసభలకు ఉత్తమ ప్రజాప్రతినిధులు ఎన్నిక కావటానికి న్యాయపాలన సంస్కరణలు ప్రభుత్వం చేపట్టాలి. ఆధునిక డిజిటల్ సాంకేతికతతో అభ్యర్థుల ఎంపిక ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు 6 నెలల ముందు ఉత్త మ అభ్యర్థుల గుర్తింపు, ఎంపిక కోసం నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాలను సేకరించాలి. ఈ మేరకు ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.
నియోజకవర్గంలో ఓటర్ల ప్రథమ ప్రాధా న్యం పొందిన అభ్యర్థికి టికెట్లు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తే టికెట్ కోసం డబ్బు లు ఇచ్చి కొనుక్కునే సంస్కృతికి తెరపడుతుంది. మేధావులు, రాజ్యాంగం, చట్టాల పట్ల అవగాహన వున్న రాజనీతిజ్ఞులు చట్టసభలకు ఎన్నికై మెరుగైన సమాజ ఆవిర్భావానికి దోహదపడే అవకాశాలు ఏర్పడతాయి. ప్రజా విశ్వాసం వున్న ఉత్త మ వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేరి సమాజ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని, రాజకీయాలలో సంపన్నుల ప్రాబల్యాన్ని, కార్పొరేట్ సంస్థలు, అధినేతల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు.
ఓట ర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్సై ట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుం డా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్థితులనూ సీఈసీ కల్పించాలి. అప్పు డే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. గెలిచిన అభ్యర్థి అవినీతికి పాల్పడినా, ఇచ్చిన హామీలు అమలు చేయక పోయినా ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అధికార దుర్వినియోగం, రాజకీయ అవినీతిని అరికట్ట వచ్చు. ప్రభుత్వం మెరుగైన ప్రజా ప్రాతినిధ్య చట్టాల కోసం ఈ మేరకు రాజ్యాం గ సవరణ చెయ్యాలి.
పొలిటికల్ సర్వీస్ కమిషన్ కావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన అర్హత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమిస్తున్నట్లుగానే ప్రభుత్వం ‘ఆల్ ఇండియా పొలిటికల్ సర్వీస్ కమిషన్’ ఏర్పాటు చేసి పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులు మాత్రమే సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా విధి విధానాలు రూపొందించాలి. మేధావులు, యువత రాజకీయా లలో క్రియాశీలక పాత్ర పోషించాలి.
యువత తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపాలి. సమర్థులను చట్టసభలకు సభ్యులుగా ఎన్నుకోవాలి. జాతి తలరాతను మార్చేది రాజకీయాలే అన్న స్పృహ ఓటర్లలో ముఖ్యంగా యువతలో కలగాలి. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే శక్తి యువతరానిదే అన్న వాస్తవాన్ని విస్మరించరాదు. వారే నవ రాజకీయాలకు నేతృ త్వం వహించి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలి.
నేదునూరి కనకయ్య