calender_icon.png 14 June, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

14-06-2025 01:02:18 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురం శ్రీ బూనీల సమేత వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచనము, రక్షాబంధనము, దీక్షా స్వీకారం, మచ్చం గ్రహణం, అంకురార్పణ, వైనతేయ పటాధివాసం, సోమహోమం, తత్వన్యాస హోమం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.