14-06-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూన్ 13 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర పెళ్లి గ్రామంలో హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటూ రూ. 15 వేల చొప్పున జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ శుక్రవారం తీర్పునిచ్చారు.
2022 జూన్ 8న జగిత్యాల మండలం మోరపల్లి శివారు చెరువులో గుర్తు తెలియని మహిళ అనుమాదాస్పద మృతిపై సెక్రెటరీ ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ ఎస్త్స్ర అనిల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి సీఐ కృష్ణ కుమార్ దర్యాప్తు చేయగా, సదరు మహిళ మ ల్యాల మండలం తాటిపెళ్లి గ్రామానికి చెందిన అంజలిగా గుర్తించారు.
అంజలి మానసిక ఆరో గ్యం బాగా లేక పోవడంతో ఆమె భర్త కోట్ల రాజశేఖర్ ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కోలుకోకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై తన భార్యను చంపడం ద్వారా తాను సంతోషంగా ఉండొ చ్చని, పథకం ప్రకారం స్నేహితుడైన అడువాలు నరేష్, రాజశేఖర్ మోరపల్లి శివారులోని చెరువు దగ్గరికి అంజలిని తీసుకొని వెళ్లి పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి చెరువులో పడేయడం జరిగింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నేరం చేసిన నిందితులు రాజశేఖర్, నరేష్’లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఎస్.నారాయణ ఇద్ధరు నిందితులకు జీవిత ఖైదుతో పాటూ ఒక్కక్కరికీ రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.కాగా ఈ కేసును పకడ్బందీగా విచారణ జరిపి కొర్టులో ప్రవేశ పెట్టిన అడిషనల్ పీపీ మల్లేశం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కృష్ణ కుమార్, అనిల్, శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ నరేష్, రాజులను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.