15 March, 2026 | 9:20 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బీసీసీఐ, హెచ్‌సీఏకు హైకోర్టు నోటీసులు

08-11-2024 01:03 AM

హైదరాబాద్, నవంబర్ 7  (విజయక్రాంతి): భార త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), హైదరాబాద్ క్రికె ట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏలో జరగుతున్న అవకతవకలపై నిర్ణీత గడువులోగా సీబీ ఐ విచారణ జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.

హెచ్‌సీఏ ఆధ్వ ర్యంలోని వివిధ క్రికెట్ క్లబ్బుల్లో పే-అండ్-ప్లే సంస్కృతి కారణంగా ప్రతిభావంతులైన యువకులు అవకాశాలను కోల్పోతున్నారని హైకోర్టును టీసీఏ ఆశ్రయిం చింది. సొసైటీ చట్టం ప్రకారం క్లబ్స్ వ్యక్తిగత ఆస్తిగా ఉండకూడదని, అయితే ఇప్పటికీ కొంతమంది సభ్యు లు 30 నుంచి 40 ఏళ్లుగా ఈ ఆస్తులకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ వాదించారు.

లోథా కమిటీ సిఫార్సులు, బీసీసీఐ, హెచ్‌సీఏ  చట్టా ల ప్రకారం, ఒక సభ్యుడు క్రికెట్ క్లబ్‌లో 9 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదని చెప్పా రు. అయితే ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అవకతవకలకు పాల్పడిన వ్యక్తులపై చర్య లు తీసుకోవడంలో హెచ్‌సీఏ విఫలమైనందున సీబీ ఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును టీసీఏ కోరింది. తదుపరి విచారణ 28కివాయిదా పడింది.