06-06-2025 12:00:00 AM
బెంగళూరు, జూన్ 5: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సభ సందర్భం గా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలా ట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నో టీసులు జారీ చేసింది. చిన్నస్వామి స్టేడియం లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో లోపాలు ఉండటంపై న్యా యస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్టేడి యం బయట అంబులెన్స్లు ఎందుకు ఏ ర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి న హైకోర్టు సుమోటో కేసును రిజిస్టర్ చే సింది.
తొక్కిసలాట జరగడానికి గల కారణా లు, దీనిని ఎందుకు నిలువరించేలేకపోయా రు?, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోబోతున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించి ంది. అనంతరం కేసులో తదుపరి విచారణ ను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.
తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సీఐడీ, జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ విచారణ జరగనుంది. ఘటనపై 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఘటను బాధ్యత వహిస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా అడిషనల్ సీపీ, ఏసీపీ, డీసీపీ, కబ్బన్ పార్క్ ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసులో ఏ1గా ఆర్సీబీ యాజమాన్యం, ఏ2గా ఈవెంట్ నిర్వాహకులు డీఎన్ఏ నెట్వర్క్స్, ఏ3గా కేఎస్సీఏను చేర్చింది.
మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 11 కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఇక కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సైతం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది.