06-06-2025 12:00:00 AM
లక్నో, జూన్ 5: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆ లయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం ఘనంగా జ రిగింది. ఆలయ మొదటి అంతస్తులో కొత్తగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు వేదమంత్రోఛ్చారణల మధ్య కా ర్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఉ దయం 11.45 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మొదలైన ప్రధాన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.
మొత్తం 101 మంది వేద ప ండితులు పాల్గొని శాస్త్రోక్తంగా మంత్రాలు ప ఠిస్తుండగా రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. రామ్దర్బార్ లో ప్రతిష్ఠించిన విగ్రహాలకు 11 కిరీటాలు, హారాలు, చెవిపోగులు, నుదితి తిలకాలు, వి ల్లులతో రూపొందించారు.
ఈ కార్యక్రమ ంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి నూతన విగ్రహాలకు హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. రామ్ ద ర్బార్తో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏడు ఉప ఆలయాల్లో కూడా ఇదే సమయ ంలో విగ్రహ ప్రతిష్ఠాపనలు జరగడం వి శేషం. జూన్ 3న మొదలైన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది.
తెలంగాణ నుంచే ప్రధాన ద్వారాలు..
రామ్దర్బార్ మందిరానికి వినియోగించిన ఆలయ ప్రధాన ద్వారాలు తెలంగాణ నుంచే పంపించడం విశేషం. ఆలయ ప్రాంగణంలోని 14 ఉప ఆలయాలకు కూడా ద్వారాలను ఇక్కడి నుంచే తయారు చేసి పంపించారు.