14 July, 2026 | 3:22 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

హైడ్రా పంజా.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే

23-09-2024 04:25 PM

హైదరాబాద్: దుర్గం చెరువు సరస్సు చుట్టూ హైడ్రా కూల్చివేతలను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమర్ సొసైటీ నివాసితులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదంటూ కోర్టులో పిటిషన్లు దాఖాలయ్యాయి. ఎఫ్ టీఎల్ నిర్ధరణపై దాఖలైన పిటిషన్లను సీజే ధర్మాసనం విచారించింది. ఎఫ్ టీఎల్ పై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీకి బాధితులు అభ్యంతరాలు తెలపాలని కోర్టు సూచించింది.

వారంలోపు బాధిుతులు అభ్యంతరాలు తెలపాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 6 వారాల్లో ఎఫ్ టీఎల్ నిర్ధారించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 6 వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గంచెరువు ఎఫ్ టీఎల్ 65 ఎకరాలే ఉందని పిటిషన్లు పేర్కొన్నారు. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ 160 ఎకరాలు ఉందని అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాపోయారు. ఇప్పటివకే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్స్ (FTL), సరస్సుల బఫర్ జోన్‌లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా  బృందం పరిశీలిస్తోంది.