15 March, 2026 | 9:02 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బీసీ కమిషన్‌తో ఉన్నతాధికారుల భేటీ

15-09-2024 01:08 AM

కులగణన, క్షేత్రస్థాయి పరిశీలన షెడ్యూల్‌పై చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్‌తో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శనివారం కమిషనర్ కార్యాలయంలో సమా వేశమయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయదేవిలతో  కులగణన విధివిధా నాలపై చర్చించారు. త్వరలో కులగణన కార్యాచరణను ప్రకటించాలని నిర్ణ యించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాల వారీగా పర్యటించే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.