28 June, 2026 | 3:50 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

కొండగట్టుకు పాదయాత్ర

28-11-2025 08:00 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్  మంచిర్యాల నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టుకు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో జగన్ ను లక్షెట్టిపేట కోర్టు న్యాయవాదులు స్వాగతించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా కేంద్రంలో కోర్టుకు శాశ్వత బిల్డింగ్ నిర్మాణం జరిగితే తాను కొండగట్టు అంజన్న స్వామికి మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కలను తీర్చడానికి ఈ పాదయాత్ర ప్రారంభించానన్నారు. జగన్ ను సన్మానించిన వారిలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు వొజ్జల నళిని కాంత్, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, గోవిందరావు, వ్యాపారస్తులు పల్లెర్ల శ్రీనివాస్, దయాసాగర్ తదితరులున్నారు.