6 June, 2026 | 10:32 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

హిందాల్కో నికరలాభం రూ.3,074 కోట్లు

14-08-2024 12:05 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ హిందాల్కో ఇండస్ట్రీస్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 25 శాతం వృద్ధిచెంది రూ.3,074 కోట్లకు పెరిగింది. ముడి వ్యయాలు తగ్గడం, నిర్వహణా సామర్థ్యాలు పెరగడం లాభాల వృద్ధికి కారణమని హిందాల్కో తెలిపింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.2,454 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.53,382 కోట్ల నుంచి రూ. 57,437 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.6,109 కోట్ల నుంచి రూ.7,992 కోట్లకు చేరింది. తమ కాపర్, అల్యూమినియం ఇబిటాలు పటిష్టంగా పెరిగినట్టు కంపెనీ తెలిపింది.