6 June, 2026 | 11:53 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

ఎన్‌ఎండీసీ లాభం 18% అప్

14-08-2024 12:05 AM

హైదరాబాద్, ఆగస్టు 13: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన క్యూ1లో 18 శాతం వృద్ధిచెంది రూ.1,963 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.1,661 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిస్తున్న ఎన్‌ఎండీసీ మొత్తం ఆదాయం రూ. 5,689 కోట్ల నుంచి రూ. 5,779 కోట్లకు పెరిగింది. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని కంపెనీ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు.