10-08-2024 12:15:14 PM
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో పోస్ట్ చేసింది. తన ఎక్స్ ఖాతాలో "సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా" అని రాసింది. దీంతో భారత మార్కెట్లో మరో బాంబు ధమాకా పేల్చబోతుందా? అని స్టాక్ మార్కెట్ పండితులు నెట్టింట్లో చర్చకు తెర లేపారు. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కట్లు అప్ ట్రెండ్లో ఉంటూ నూతన శిఖరాలు అధిరోహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హిండెన్బర్గ్ నివేదిక ఆన్ లైన్ లో వైరల్ న్యూస్ గా మారింది.
అదానీ గ్రూప్ తమ లిస్టెడ్ కంపెనీల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో హిండెన్ బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో వ్యాపారవేత్తలకు స్నేహపూరితంగా ఉండే కరేబియన్, మారిషస్ లనుంచి యూఏఈ దేశాల్లో అదానీ గ్రూప్ పలు డొల్ల కంపెనీలను నడుపుతోందని తెలిపింది.
తద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపుకు పాల్పడుతోందని ఆరోపించింది. సంచలన పూరితమైన ఈ వార్త ట్వి్టర్ లో వెలువడాన తదనంతరం అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. తరుువాత్తరువాత అదానీ షేర్లు పుంజుకున్నా సదరు నివేదికను అమెరికా షార్ట్ సెల్లార్ హిండెన్ బర్గ్ ముందే తమ క్లయింట్ల తో పంచుకుందని సెబీ ఆరోపించింది.అవును ఇదంతా చేస్తే హిండెన్ బర్గ్ కు ఏంటి లాభం ? నివేదిక విడుదల తదనంతరం ాయా క్లయింట్లు ఆర్జంచిన లాభాల్లో వాటా తీసుకుంటుందని సెబీ పేర్కొంది