28 July, 2026 | 1:47 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ.3 లక్షలు జరిమానా

05-06-2026 08:18 PM

- డ్రైవింగ్ లైసెన్స్ లేని 18 మందికి రూ.90వేలు ఫైన్

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేయగా, 28 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. న్యాయమూర్తి విచారణ జరిపి  28 మందికి రూ. మూడు లక్షల జరిమానా విధించినట్టు తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ, పట్టుబడిన 18 మందికి రూ.90 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు.