10-08-2024 12:48:36 PM
ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి 17 నెలల తర్వాత విడుదలయిన విషయం తెలిసిందే. ఆయన శనివారం తన ఇంట్లో భార్యతో కలిసి టీ తాగుతూ కనిపించే ఫోటోను తన ఎక్స్ ఖాతా లో మనీష్ సిసోడియా చేసిన తొలి పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛ గా జీవించే హక్కు కల్పించింది. ప్రతి ఒక్కరితో కలిసి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే హక్కును ఆ భగవంతుడు మనకు ప్రసాదించాడు అన్నాడు.