ప్రభుత్వ పాఠశాలలో హోలీ వేడుకలు
03-03-2026 12:00 AM
నిజాంసాగర్, మార్చి 2 (విజయ క్రాంతి) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రతి పండుగల సందర్భంగా విద్యార్థులను ప్రోత్స హిస్తూ కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామస్తులు ఆయనను అభినందిస్తున్నారు.




