05-08-2025 12:40:38 AM
పోగొట్టుకున్న వ్యక్తికి పర్సు అప్పగింత
బూర్గంపాడు, ఆగస్టు 4,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపా డు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాడుగుల ప్రశాంత్ టీఎస్ 28టీ 6744 భద్రాచలం వెళ్తుండగా మార్గమ ధ్యలో రెడ్దిపాలెం సమీపం లో పర్సు పోగొట్టుకున్నాడు. అదే దారిలో భద్రాచలం ఆటోలో వెళుతున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన పెరిక రోషయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బాధవత్ లలిత లకు రోడ్డుపై పర్సు పడివుండటం గమనించి దానిలోని సుమారు రూ 16,000 కింద పడి ఉండగా వాటిని తీసుకొచ్చి నిజాయితీగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.పర్సులో ఉన్న కార్డు ఆధారంగా ఎస్ఐ మేడా ప్రసాద్ అతన్ని పిలిపించి పర్సును అప్పగించారు. నిజాయితీ చాటుకున్న వారిని ఎస్ఐ మేడా ప్రసాద్ అభినందించారు.