27-06-2025 01:53:09 AM
కరీంనగర్, జూన్ 26 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత పాఠశాలలోని 9 తెలంగాణ బెటాలియన్ ఎన్.సి.సి కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎ. కె. జయంత, సుబేదార్ మేజర్ సాగర్ సింగ్ లను సత్కరించామని పారమిత పాఠశాల సీనియర్ ప్రధానోపాద్యాయులు ప్రశాంత్ తెలిపారు.
పారమిత పాఠశాలలోని ఎన్.సి.సి విభాగం 4 సంవత్సరాల పాటు వివిధ దశలుగా అభివృద్ది చెందిన క్రమాన్ని, ఎన్ సి సి కార్యక్రమాలను నిర్వహించే విధానాన్ని పరిశీలించి, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలను చేపట్టే విధానాన్ని ఆయన ప్రశంసించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్స్ అనుకర్ రావు, వినోదరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, సమన్వయకర్త శ్రీనాథ్, ఎన్.సి.సి బి. ప్రశాంత్, ఎక్సర్వీస్ మెన్ రమేశ్ పాల్గొన్నారు.