calender_icon.png 22 June, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

04-12-2024 03:46:38 AM

  1. ఆ జిల్లాల్లో 100 శాతం కంప్లీట్
  2. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే 

హైదరాబాద్, డిసెంబర్ 3(విజజక్రాంతి): దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే  15 జిల్లా ల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488 కుటుంబాల గణన  పూర్తి చేశారు. వీటిలో 79,63,637 కుటుంబాల డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. దాదాపు 67.8 శాతం డేటా ఎంట్రీ జరిగింది.

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మంగళవారం నాటికి 15  జిల్లాల్లో వందకు వంద శాతం సర్వే పూర్తయింది.ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగాం, ఖమ్మం, నల్గొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబా బాద్, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లా లు వంద శాతం సర్వే పూర్తయిన జాబితాలో ఉన్నాయి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుం దని, రాష్ట్రంలో చేపట్టే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని వర్గాలు సర్వేలో పాలుపంచుకున్నాయి.