17-10-2025 01:35:14 AM
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ కావడంతో.. భవిష్యత్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై 23న జరిగే తదుపరి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అంతకు ముందే లీగల్గా, వివిధ సంఘాలతో కూడా ప్రభుత్వం సమావేశం నిర్వహి స్తుందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఈ మూడు వ్యవసాయ కళాశాలు కొడంగల్, హూజూర్ నగర్, నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు క్యాబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిందని చెప్పారు. ఈనెల 23న మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలు..
కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని.. ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యే క బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
* రాష్ర్టంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు రాష్ర్ట మం త్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూ ర్నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రి కల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమో దం తెలిపింది.
* రాష్ర్టంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెం డేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
* ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ర్టంలో జనా భా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధన ను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ అంగీకరించింది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్కు పది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం
* నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని క్యాబినెట్ తీర్మానం చేసింది.
* హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ర్ట మం త్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతు గా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ని ర్ణయించింది.
అందుకు సీఎస్ ఛైర్మన్గా , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూ డీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
* రాష్ర్టంలో హ్యామ్ మోడ్లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీ య రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతా లు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయం
* ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నా యంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
* కృష్ణా- వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ర్ట క్యాబినెట్ తీర్మానం
* మన్ననూర్- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ర్ట ప్రభు త్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
క్యాబినెట్ నిర్ణయాలు..
* ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ర్టంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులుసేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి.
* వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయిం చింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమచేయాలని నిర్ణ యం తీసుకుంది. కలెక్టర్లు, అదనపు