15-06-2025 01:59:44 AM
మంత్రి పదవుల్లో, శాఖల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పూర్తయ్యేదెప్పుడు?
హైదరాబాద్, జూన్ 1౪ (విజయక్రాంతి): ‘జితినే హిస్సేదారి.. ఉతినే బాగేదారి’.. ఎవరి జనాభా ఎంతో, వారికి అంత వాటా ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ నినాదం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్గాంధీ చెపుతున్న సామాజిక న్యాయసూత్రం అమలుకు ముందడుగు పడుతోంది. రాహుల్గాంధీ ఆలోచనలను అమలుచేయడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది.
ఇక సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం దక్కే విధంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల కేటాయింపులో సా మాజిక న్యాయం అమలు చేయడం లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, రాష్ట్ర క్యాబినెట్లో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులకు కేటా యించిన శా ఖలపై బీసీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శాఖల కేటాయింపులో అసమానతలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నా, ఈ విషయంలో మార్పు రావడంలేదని బీసీ వర్గాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాహుల్గాంధీ పదే పదే చెపుతున్న సామాజిక న్యాయ సూత్రాన్ని అమలుచేయడంలో.. తెలం గాణ రాష్ట్రంలో కొంత మార్పువచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతు న్నది.
రాష్ట్రంలో కులగణన చేపట్టి.. బీసీల జనాభా 56% ఉందని రేవంత్రెడ్డి ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచే సేందుకు.. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, కేంద్రానికి కూడా పంపించడం తో.. ఆయా వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీపై సానుకూలత పెరిగిందని ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి.
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇవ్వగా, అందులో ఎస్సీల నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్, వివే క్, బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి చోటు కల్పిం చారు. దీంతో రేవంత్రెడ్డి క్యాబినెట్లో బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు శ్రీహరి చేరినట్టయింది. అయితే మంత్రులకు కేటా యించిన శాఖలు ఆప్రధానమైనవనే అ భిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు క్యాబినెట్లో 14 మం ది మంత్రులు ఉన్నారు. వీరిలో ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లు ఓసీ వర్గానికి చెందిన వారు.
బీసీ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇటీవలనే మంత్రి పదవి దక్కించుకున్న వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఉండగా, ఎస్సీ సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , దామోదర రాజనరసింహ, కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న అ డ్లూరి లక్ష్మణ్కుమార్, గడ్డం వివేక్ ఉండగా, ఎస్టీ ఆదివాసి సామాజికవర్గం నుంచి మం త్రి సీతక్క క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
న్యాయం జరుగుతుందా?
రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా మూడు బె ర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు బెర్తుల కోసం రెడ్డి సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబా ద్ జిల్లాకు చెందిన సుదర్శన్రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన మం త్రివర్గ విస్తరణలో వీరికి చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేయగా, పార్టీ అధి ష్ఠానం రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసిం ది.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో న్యాయం చేస్తామనే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బీసీలలోని మున్నూరుకాపు, గొల్ల కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీసీ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సామాజిక అసమానతలు తొలగేందుకు తాము ఇంకెంతకాలం, సామాజిక నిచ్చెన మెట్లు ఎన్ని ఎక్కాలి అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఇటీవలే నియామకమై న ఆర్టీఐ కమిషన్లో పోస్టుల్లోనూ బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది.
అప్రధాన శాఖలు!
ఉన్నత కులాలకు చెందిన మంత్రుల వద్దనే కీలక శాఖలున్నాయని, బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు కీలక శాఖలు దక్కడంలేదని ఆయా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి వద్ద హోంశాఖ, విద్య, మున్సిపల్ తదితర కీలక శాఖలున్నాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు సీఎం వద్ద ఉన్న కొన్ని శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వద్ద కీలకమైన నీటిపారుదల (ఇరిగేషన్), సివిల్ సప్లయ్ శాఖలున్నాయి. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వద్ద రెవెన్యూ, స్టాంప్స్అండ్ రిజిస్ట్రేషన్, హౌజింగ్, సమాచార శాఖలు ఉండగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వద్ద ఆర్అండ్బీ, సినీమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. ఇక మరో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వద్ద వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు, జూపల్లి కృష్ణారావు వద్ద ఎక్సైజ్, టూరిజం శాఖలు ఉన్నా యి.
ఇక ఎస్సీ సామాజికవర్గానికి చెంది న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద కూడా కీలకమైన ఆర్థికం, విద్యుత్ శాఖ లు ఉన్నాయి. మరో మంత్రి దామోదర రాజనరసింహ వద్ద వైద్య, ఆరోగ్య శాఖ, గడ్డం వివేక్కు కార్మిక, మైనింగ్ శాఖలు కేటాయించారు.
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్కకు పంచాయ తీ రాజ్తో పాటు మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలున్న విషయం తెలిసిందే. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకే అంతగా ప్రాధాన్యత కలిగిన శాఖలు లేవని సొంత పార్టీలోని బీసీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బీసీ సంఘాలు నుంచి తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మంత్రి పొన్నం ప్రభాకర్కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ లు ఉండగా, మంత్రి కొండా సురేఖకు పారెస్టు, పర్యావరణం, ఎండోమెంట్ శాఖలు ఉన్నాయి. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వాకిటి శ్రీహరి ముదిరాజ్కు పశుసంవర్థక, ఫిషరీష్, డైయిరీ డెవలప్మెంట్ శాఖలను సీఎం రేవంత్రెడ్డి కేటాయించారు.
పార్టీలో 67 శాతానికిపైగా పదవులు..
కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవలనే ప్రకటించిన పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధా న కార్యదర్శుల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేశామని చెబుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు -8, ఎస్సీ-5, ఎస్టీ - 2, ముస్లింలకు-3 చొప్పున 67 శాతం పదవులు ఆయా సామాజిక వర్గాలకు దక్కాయి.
69 మంది పీసీసీ ప్రధాన కార్యదర్శుల్లో 26 మంది బీసీలు, 9 మంది ఎస్సీలు, 4గురు ఎస్టీలకు ఇవ్వగా 8 పదవులు ముస్లింలకు ఇచ్చారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మస్లిం మైనార్టీలకు కలిసి మొత్తం 68 శాతం పదవులు కట్టబెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.