calender_icon.png 15 June, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగిన కరెంటు తీగలు.. ఇద్దరు సజీవ దహనం

15-06-2025 09:04:34 AM

ఎల్బీనగర్ లోని చింతలకుంటలో విషాదం 

ఇద్దరు భిక్షాటన చేసే వ్యక్తులు మృతి

ఎల్బీనగర్: ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు(Sagar Ring Road) లోని చింతలకుంటలో రేణుకా ఎల్లమ్మ ఆలయం(, Renuka Yellamma Temple) సమీపంలో శనివారం అర్ధరాత్రి 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడడంతోఇద్దరు భిక్షాటన చేసే వ్యక్తులు సజీవ దహనం వారితోపాటు ఓ వీధి కుక్క సైతం మృతి చెందింది. అర్దరాత్రి వేళలో ఇంటికి వెళ్తున్న ఒక వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఎల్బీనగర్ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department officials) ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. వైర్ బీడింగ్ తెగిపోవడంతో ఈ ఘటన జరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు. కరెంట్ తీగలు తెగిపడడంతో ఇద్దరు భిక్షాటన చేసే వ్యక్తుల  అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.‌ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నా దర్యాప్తు చేపడుతున్నామని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.