15-06-2025 01:54:32 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి--బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్(పీఎఫ్ఆర్)ను తక్షణమే తిరస్కరించాలని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబం ధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను నిలువరించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అందుకే వెంటనే ఆపేందుకు కేంద్రం చర్య లు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు శనివారం బహిరంగలేఖ రాశారు. ఏపీ తీరు వల్ల 1980లో గోదావరి జలాల ఒప్పందాన్నీ ఉల్లంఘించినట్లు అవుతుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడమే అవుతుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ 2న నిర్వహించిన సమావేశంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ చేసిన సూచన ఇందుకు అద్దం పడుతోందన్నారు. అప్పటికే పీఎఫ్ఆర్ ఆమోదించినట్లు భావించాల్సి వచ్చిందన్నా రు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ సమర్పించడం అంటే సీడబ్ల్యూసీ ఆమోదించి నట్లు అవుతుందా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
ఏపీ వెనుకబాటుతనాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్ట్ కోసం కేంద్రాన్ని నిధుల కోసం ఒత్తిడి చేసిన అంశాన్ని ఈ ఏడాది జనవరి 22న కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్కు లేఖ రాసినట్లు మంత్రి గుర్తుచేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే ముందుకు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం గత ఏడాది నవంబర్ 15న, డిసెంబర్ 29న కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయించారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.80,113 కోట్లు కాగా గోదావరి నుంచి కృష్ణా వరకు రూ.13,511 కోట్లు అవుతుందని, కృష్ణా నుం చి బొల్లపల్లి రిజర్వారాయర్కు రూ.28,560 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ఆ లేఖలో వివరించారని తెలిపారు.
బొల్లపల్లి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులెటరీకి రూ. 38,041కోట్లు ఖర్చు అవుతుందని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. సీడబ్ల్యూసీతో పాటు గోదావరి, -కృష్ణా నది బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగిందని ఆయన మం డిపడ్డారు.
జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం చూసినా 1,486 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించబడ్డాయ న్నారు. ఈ నీటి వాటాల్లో తెలంగాణ కేటాయింపులకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ ఆమో దం కోసం వేచిచూస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదిస్తుందని మంత్రి ప్రశ్నించారు.
కేటాయింపులు లేకుండా ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారు..
నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఏపీకి ఎక్కడిదని ఉత్తమ్ నిలదీశారు. వాస్తవానికి గోదావరి నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ప్రకారం వరద నీరు అనే ప్రస్తావన లేదన్నారు. ఉంటే గింటే నది సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలకు సరి సమానహక్కు ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు తమకు అందలేదని ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు.
సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతర్ రాష్ర్ట ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు తెలంగాణను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయన్నారు.
బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని టెండర్ల ప్రక్రియను నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వ్యవహరం ముందుకు సాగితే తెలంగాణ రాష్ర్టంపై జరిగిన దాడిగా పరిగణిస్తామన్నారు. ఈ వ్యవహరం న్యాయబద్ధం గా తమకు దక్కాల్సిన నీటి కేటాయింపులకు ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని అన్నారు.
అప్పనంగా నీటిని అప్పగించిన ఘనత బీఆర్ఎస్దే..
తెలంగాణ నీటి వాటాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత వల్లే రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 724 టీఎంసీలు కాగా..290 టీఎంసీలకు కుదించి 512 టీఎంసీలను ఏపీకి అప్పనంగా అప్పగించిన ఘనత మీదేనని హరీశ్రావును ఉద్దేశించి విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు అపెక్స్ కౌన్సిల్ను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు. నాటి ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ తీరువల్లే తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు.