calender_icon.png 29 July, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ పాయిజనింగ్‌పై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం

29-07-2025 02:38:29 AM

నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగర్‌కర్నూల్ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన- మీడియా ద్వారా వెలుగులోకి రాగా హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ సంబంధిత అధికారులను ఆగస్టు 28 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.